Tuesday, 13 October 2020

50 ఏళ్లు పైబడిన వాళ్లకూ అదే పని.. యంగ్ గర్ల్స్‌తో! అస్సలు వదలను.. దుమ్ముదులిపిన స్టార్ హీరోయిన్

గత కొన్నినెలలుగా బాలీవుడ్ బడా బాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న మరోసారి నోరువిప్పింది. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ తీరుపై జాతీయ మీడియా చేస్తున్న ప్రసారాలను ఖండిస్తూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ గురించి స్పందించిన కంగనా.. ఎవ్వరేం చేసుకున్నా ఊపిరున్నంత కాలం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మురికితో పేరుకుపోయిందని, బాలీవుడ్‌లో డ్రగ్స్ కంపు లేని పార్టీ ఒక్కటి కూడా ఉండదని మొదటినుంచే సంచలన కామెంట్స్ చేస్తూ వస్తున్న కంగనా రనౌత్.. మరోసారి రెచ్చిపోయింది. డ్రగ్స్‌, దోపిడీ, స్వార్థం, నెపోటిజం లాంటి వాటితో బాలీవుడ్ కంపు కొడుతోందని, దాన్ని అలాగే శుభ్రం చేయకుండా వదిలేశారని పేర్కొంటూ ట్వీట్ చేసింది. బాలీవుడ్‌ స్ట్రయిక్స్ బ్యాక్‌ అంటూ తనపై కూడా కేసు పెట్టుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. Also Read: స్టార్‌ హీరోలు మహిళల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, 50 ఏళ్లు పైబడిన వాళ్ళు కూడా యంగ్ గర్ల్స్‌ని దోపిడీ చేస్తూ ఆడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ లాంటి ఎంతోమందిని పైకి రాకుండా తొక్కేశారని, వాళ్ల కళ్లముందే అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని తెలుపుతూ ఫైర్ అయింది కంగనా. Also Read: అంతటితో ఆగక.. ''నా చెత్త రహస్యాలు నువ్వు‌ బయటపెట్టకు.. అలాగే నీ చెత్త రహస్యాలు నేను బయటపెట్టను'' అనే లిఖించబడని ఓ చట్టం ఫిలిం ఇండస్ట్రీలో ఉందంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. తాను పుట్టినప్పటి నుంచి ఈ ఇండస్ట్రీని కొన్ని ఫ్యామిలీలే ఏలుతున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడొస్తుందంటూ సూటిగా ప్రశ్నించింది కంగనా రనౌత్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36YP1kq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...