బుల్లితెర నటి కొండపల్లి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. వీరిని విచారించి రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. ఈ కేసులో ఎ3గా ఉన్న అశోక్ రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం వస్తానని చెప్పి చివరి నిమిషంలో అశోక్ రెడ్డి మస్కా కొట్టారు. సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో అశోక్ రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దేవరాజ్కు శ్రావణి దగ్గర కావటాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. సాయికృష్ణా రెడ్డి ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. Also Read: సెప్టెంబరు 7న అమీర్పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్ రెడ్డి, అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం అశోక్ రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఈ కేసులో అశోక్ రెడ్డి అరెస్టు కావడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iAj4SD
v
No comments:
Post a Comment