Thursday, 17 September 2020

కరీంనగర్ వీధుల్లో నటుడు షకలక శంకర్ భిక్షాటన.. ఓ మంచి పనికోసం

కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుడు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. తాను సంపాదించే మొత్తంలో కొంత సమాజ సేవకు ఉపయోగిస్తున్నారు. తన వల్ల కాకపోతే విరాళాలు సేకరించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇటీవల లక్షా పది వేల రూపాయలు వెచ్చించి ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన శంకర్.. తాజాగా కరోనా వైరస్ కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఆ ఏడు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి కరీంనగర్ వీధుల్లో శంకర్ భిక్షాటన చేశారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా.. మిగిలిన డబ్బులు తాను జోడించి, మొత్తం లక్ష రూపాయలతో కరీంనగర్‌లోని ఏడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి, అందుకు తనకు సహకరించిన కరీంనగర్ ‘విందు భోజనం’ మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బీటీఆర్‌లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం కోసం వేడుకుంటున్నానని శంకర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే, శంకర్ ప్రస్తుతం హీరోగా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘లాస్ట్ గాడ్‌ఫాదర్’ అనే సినిమాను శంకర్ మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే, ‘రాంగ్ గోపాల్ వర్మ’ సినిమాలో శంకర్ టైటిల్ రోల్ పోషించారు. ఇంకా, ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ అనే సినిమా కూడా శంకర్ చేస్తున్నారు. Also Read: Must Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ko76fm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...