డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న కన్నడ హీరోయిన్లు , మరో వివాదంలో చిక్కుకున్నారు. కేసులు చాలవన్నట్లు కొత్తగా సెక్స్ రాకెట్ వ్యవహారంలో వీరిపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించడంతో రాగిణి, సంజన దాని నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ సమయంలోనే వారిపై సెక్స్ రాకెట్ ఆరోపణలు రావడం కలకలం రేపింది. డ్రగ్స్ కేసు విచారణలో హీరోయిన్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సీసీబీ పోలీసులు వారి మొబైల్ ఫోన్స్ పరిశీలించారు. వాటిలో ఇతర అమ్మాయిల అశ్లీల వీడియోలు, అర్ధనగ్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. వీరికి సెక్స్ రాకెట్తో సంబంధాలున్నాయన్న అనుమానాలు రావడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. Also Read: వ్యభిచారంతో పాటు బ్లూ ఫిలిమ్స్ రాకెట్లకు సంబంధించి రాగిణి, సంజనా ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆ గ్రూప్ను డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో ఆ వాట్సాప్ గ్రూపులో సమాచారాన్ని రికవరీ చేసిన సీసీబీ పోలీసులు ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారందరికీ నోలీసులు పంపి విచారించాలని అనుకుంటున్నారు. ఈ విచారణ జరిగితే ఇంకెన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయో? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ie3hYv
v
No comments:
Post a Comment