Thursday, 24 September 2020

హాస్పిటల్‌కు చేరుకున్న బాలు కుటుంబసభ్యులు.. క్షణక్షణం టెన్షన్ టెన్షన్

గాన గంధర్వుడు, ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి దిగజారిందని గురువారం సాయంత్రం ఎంజీఎం హాస్పిటల్‌ డాక్టర్లు హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, సన్నిహితులు హాస్పిటల్‌‌కు చేరుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆగస్టు 5 వ తేదీన ఎస్పీబీ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌ చేశారు. చికిత్స సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడిన బాలు చివరికి కోలుకున్నారు. కొద్దిరోజుల్లోనే తన తండ్రి ఇంటికి వచ్చేస్తున్నారంటూ తనయుడు ఎస్పీ చరణ్ వీడియో సందేశం విడుదల చేశారు. దీంతో తమ అభిమాన గాయకుడు కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తున్నాడని అభిమానులు సంబర పడిపోయారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో పరిస్థితి మారిపోయింది. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. Also Read: గురువారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌తో బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎక్మో, వెంటిలేటర్‌ సహా ఇతర ప్రాణాధార మార్గాల్లో పది మంది డాక్టర్ల టీమ్ ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు, కుమార్తె సహా బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33W2F4H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...