Monday, 28 September 2020

కరోనాతో ఎంత కష్టం... తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న డైరెక్టర్

హిందీలో తెరకెక్కిన ‘’ సీరియల్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. తెలుగులో ‘పెళ్లికూతురు’ పేరుతో డబ్ అయిన ఈ సీరియల్‌ ఎంతో జనాదరణ పొందింది. ఈ సీరియల్‌లో టైటిల్ రోల్ పోషించిన అవికా గోర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతోంది. అంతగా పేరు తీసుకొచ్చిన ఈ సీరియల్ డైరెక్టర్ ప్రస్తుతం తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అవును వినడానికి బాధగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. కరోనా మహమ్మారి ఆయనకు తీసుకొచ్చిన కష్టమది. ‘బాలికా వధు’ సీరియల్‌ దర్శకుల్లో ఒకరైన రామ్‌ వ్రిక్ష గౌర్‌ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజంగఢ్‌ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసమని నేను అంజగఢ్‌ వచ్చాను. ఇంతలో లాక్‌డౌన్‌ విధించడంతో తిరిగి వెళ్లలేకపోయాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా పట్టాలెక్కడానికి సంవత్సరం పైగా పడుతుందని నిర్మాత చెప్పారు. దీంతో అప్పటివరకు ఖాళీగా ఉండటం ఇష్టంలేక నా తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నారు. అందువల్లే ఇలా తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్నాను. దీనికి నేను సిగ్గుపడటం లేదు’ అని చెప్పుకొచ్చారు రామ్‌ వ్రిక్ష. తనకు ముంబయి నగరంలో సొంతిల్లు ఉందని, ఎప్పటికైనా అక్కడికి తిరిగి వెళ్లి సినిమాల్లో రాణిస్తానన్న నమ్మకం ఉందని రామ్‌ వ్రిక్ష ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు బ్రతుకు బండి నడిపేందుకే కూరగాయల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HGGyIl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...