Tuesday, 1 September 2020

వారి మరణం మాటలకు అందని విషాదం.. ఇక ఆ తల్లిదండ్రులకు నేనే బిడ్డను: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, సినీ నటుడు పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతిచెందిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుప్పం-పలమనేరు రహదారి పక్కన 30 అడుగులు కటౌట్‌ను ఏర్పాటుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తన అభిమానుల మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి హోదాలో ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్‌, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్‌ షాక్‌‌తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్‌ కడుతుంటే విద్యుత్‌ షాక్‌ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను. Also Read: మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్‌, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపాను. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను’’ అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34TscxF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...