Tuesday, 22 September 2020

చిక్కుల్లో విశాల్ కొత్త సినిమా.. హైకోర్టు ఎంట్రీతో రిలీజ్‌కు ఇబ్బందులు

ప్రముఖ హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. ఆయన తాజా చిత్రం ‘చక్ర’ విడుదలను నిలిపివేయాలంటూ మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. డైరెక్టర్ ఎం.ఎస్.ఆనంద్ కాంబినేషన్లో ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘చక్ర’ అనే సినిమాలో విశాల్ నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే 'చక్ర' సినిమా ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ అనే నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. Also Read: అసలేం జరిగిందంటే.. విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ రూ.44కోట్ల బడ్జెట్‌తో ‘యాక్షన్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు హీరో విశాల్‌ గ్యారెంట్‌ ఉండేలా అగ్రిమెంట్స్‌ రాసిచ్చాడట. అయితే అంచనాలను తలకిందుకు చేస్తూ ఆ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4కోట్లు మాత్రమే వసూలు చేసిందట. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకునేందుకు విశాల్ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్ డైరెక్షన్‌లో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే చేస్తానని మాటిచ్చాడట. Also Read: అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా విశాల్ ఆనంద్‌తో సినిమాను తన సొంత బ్యానర్‌తో తెరకెక్కించాడు. దీంతో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. విశాల్‌ తమకు రూ.8.29 కోట్లు బాకీ ఉన్నాడని, ఆ మొత్తం చెల్లించే వరకు 'చక్ర' సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ నిర్మాతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం హీరో విశాల్‌కు, డైరెక్టర్‌ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35WGXQM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...