Tuesday, 1 September 2020

ఎవ్వరూ పట్టించుకోలేదు.. బాలకృష్ణ బాబు నా చేయి పట్టుకుని ఆపారు: అలనాటి నటి రాజశ్రీ

నటసింహ నందమూరి ప్రవర్తనపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన చాలా కోపిష్టి అని కొంత మంది అంటుంటారు. ఆ కోపమే బాలయ్యకు అందమని ఫ్యాన్స్ అంటారు. బాలయ్యకు లోపల ఒకమాట బయట ఒకమాట చెప్పడం రాదని.. ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతారని చాలా మంది చెప్పే మాట. బాలకృష్ణ బయటకు ఎంత గంభీరంగా కనిపిస్తారో.. లోపల అంత సున్నిత మనస్కుడని కూడా అంటుంటారు. కోపమొస్తే చెంపమీద కొట్టే బాలయ్యే.. ఆపదలో ఉంటే అక్కున చేర్చుకుని అండగా నిలుస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే, బాలకృష్ణ ప్రవర్తన గురించి అలనాటి నటి రాజశ్రీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చెన్నైలో 2013లో జరిగిన ‘‘ఇండియన్ సినిమా 100 ఇయర్స్ సెలబ్రేషన్స్’’లో బాలకృష్ణతో తనకు ఎదురైన అనుభవాన్ని రాజశ్రీ పంచుకున్నారు. ‘‘తమిళనాడులో 100 ఇయర్స్ ఫంక్షన్ జరిగింది. ఆంధ్రలో పిలవలేదు నన్ను. 50 ఇయర్స్‌కు పిలవలేదు.. 75 ఇయర్స్‌కి పిలవలేదు. ఒక ఆహ్వానం ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు పాత నటీనటులను కూడా పిలవాలి కదా. మీరంతా ఇప్పుడు పుట్టినోళ్లు. మేమంతా అప్పటి నుంచే ఉన్నాం కదా. 100 ఇయర్స్ అంటే గొప్పే కదా. అప్పటి వాళ్లలో కొంత మందే కదా ఉన్నాం’’ అని రాజశ్రీ అన్నారు. Also Read: అయితే, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతో గొప్ప మర్యాద చేశారని రాజశ్రీ చెప్పారు. 100 ఇయర్స్ ఫంక్షన్‌లో తామందరికీ పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేశారన్నారు. వేదికపైకి అందరినీ పిలిచారని.. అప్పటి నటీనటులు అందరికీ బహుమతులు అందజేశారని చెప్పారు. పోలీస్ ఎస్కార్ట్‌తో తామందరినీ ఇళ్లకు దిగబెట్టారని గుర్తుచేసుకున్నారు. ‘‘తెలుగు, కన్నడ, మలయాళం పురస్కారాల ప్రదానం కూడా అక్కడే చేశారు. తెలుగు వేడుకలకు కూడా నేను వెళ్లాను. కానీ, కరపత్రాల్లో మా పేరు కూడా ప్రస్తావించలేదు. అందరూ అవార్డులు తీసుకుంటున్నారు. అందరూ వెళ్లిపోతుంటే వారి వెనుకే నేను బయలుదేరాను. నేను వెళ్తుంటే బాలకృష్ణ బాబు చేయిపట్టుకున్నాడు. ‘అమ్మ ఏంటి వెళ్లిపోతున్నారు’ అన్నాడు. ‘అయిపోయింది కదా బాబు అందుకే’ అన్నాను. మీకు అవార్డు ఉంది కూర్చోండమ్మ అని చెప్పాడు. ఎంతో మర్యాదస్తుడు. రామారావు గారి పిల్లలకు కూడా ఆయన గౌరవమే వచ్చింది. చాలా పద్ధతిగా పెరిగిన పిల్లలు’’ అని రాజశ్రీ చెప్పుకొచ్చారు. Also Read: బాలకృష్ణ చెప్పిన తరవాత తనను వేదికపైకి పిలిచి అవార్డు అందజేశారని రాజశ్రీ గుర్తుచేసుకున్నారు. రాజశ్రీ తెలుగులో దాదాపు 170 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కాంతారావుతో ఎక్కువ సినిమాల్లో నటించారు. ‘పిడుగు రాముడు’, ‘అగ్గి పిడుగు’, ‘అగ్గి బరాటా’, ‘ప్రేమించి చూడు’, ‘అగ్గి వీరుడు’, ‘సప్త స్వరాలు’, ‘లక్ష్మీ కటాక్షం’, ‘చిట్టి చెల్లెలు’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘ఆత్మ గౌరవం’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో రాజశ్రీ నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రాజశ్రీ సినిమాలు చేశారు. కాంగ్రెస్ నేత తోట పంచజన్యంను రాజశ్రీ పెళ్లి చేసుకున్నారు. అయితే, కుమారుడు జన్మించిన మూడేళ్లకే పంచజన్యం కన్నుమూశారు. ప్రస్తుతం రాజశ్రీ కుమారుడు యూఎస్‌ఏలో స్థిరపడ్డారు. రాజశ్రీ ఎక్కువ కాలం యూఎస్‌ఏలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నై వస్తుంటారు. గమనిక: ఈ ఆర్టికల్ గతంలో రాజశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా రాసినది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DiADXU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...