ఇటీవలే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు హీరో తండ్రి . 82 ఏళ్ల వయసులో కండలు తిరిగి శరీరంతో యువకులకే సవాల్ విసురుతున్న ఆయన తాజాగా తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తాను ఇంత వయసులోనూ ఆరోగ్యంగా ఉండగలుతున్నానని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, దీంతో ఇంట్లోనే ఉండి చిన్నచిన్న వ్యాయామాల ద్వారా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చని జీకె రెడ్డి చెబుతున్నారు. వ్యాయామానికి సంబంధించి ఓ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు 82ఏళ్ల వయసులో ఆయన ఫిట్నెస్కు ఫిదా అయిపోతున్నారు. Also Read: జీకే గ్రానైట్స్ కంపెనీ అధినేత అయిన జీకే రెడ్డి గతంలో అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారుడు కుమారుడు విశాల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల జీకే రెడ్డికి కరోనా సోకడంతో విశాల్ దగ్గరుండి సపర్యలు చేశారు. దీంతో ఆయన కూడా వైరస్ బారిన పడ్డారు. జీకే రెడ్డి తన పేరుతోనే ఓ ఫిట్నెస్ సెంటర్ను స్థాపించి వ్యాయామ మెళకువలు నేర్పిస్తుంటారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hEzDeO
v
No comments:
Post a Comment