బాలీవుడ్ నటుడు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నాయని ఆధారాలు లభించడంతో నార్కోటిక్స్ అధికారులు రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం అప్లై చేసిన రియాకు కోర్టు నిరాకరించింది. బెయిల్ ఇచ్చేది లేదంటూ పిటిషన్ కొట్టేస్తూ షాకిచ్చింది ముంబై స్పెషల్ కోర్టు. సుశాంత్ సూసైడ్ కేసు విషయమై గత కొన్ని రోజులుగా సాగుతున్న దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రియా చక్రవర్తి సహా ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలు అరెస్ట్ అయ్యారు. తీగ లాగితే డొంక కదిలినట్లు వీరి విచారణలో ఇంకా చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకొచ్చినట్లు సమాచారం. కాగా ఎన్సీబీ విచారణలో లోపాలను ఎత్తిచూపుతూ తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా రియా చేసిన అభ్యర్థనను తాజాగా కోర్టు కొట్టిపారేయడంతో ఇక 14 రోజుల పాటు ఆమె జ్యుడిషియల్ కస్టడీ లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమెతో పాటు షోవిక్, శామ్యూల్ బెయిల్ పిటిషన్స్ కూడా కొట్టివేయబడ్డాయి. Also Read: రియా ఇంటిపై సోదాలు చేసిన సుదీర్ఘ విచారణ అనంతరం నార్కోటిక్స్ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేసి సెప్టెంబర్ 9వ తేదీన బైకులా మహిళా జైలుకు తరలించారు. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో నేరం రుజువైతే ముద్దాయికి పదేళ్ల పాటు కఠిన జైలు శిక్ష విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zt65dN
v
No comments:
Post a Comment