Tuesday, 22 September 2020

హనీమూన్‌కు వెళ్లి భర్తపై కేసు పెట్టిన పూనమ్ పాండే.. పెళ్లైన 10 రోజులకే అరెస్ట్

బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఇంటర్నెట్ సెన్సేషన్ భర్త సామ్ బోంబేను గోవా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సామ్ తనను వేధించాడని, హింసించాడని, తనపై దాడి చేశాడని పూనమ్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామ్‌ను అరెస్ట్ చేశారు. సామ్‌ను దక్షిణ గోవాలోని కనకోనలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుత పూనమ్ పాండే అక్కడ ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని వెల్లడించారు. ‘‘తన భర్త సామ్ బోంబే తనను బెదిరించడమే కాకుండా తనపై దాడి చేశాడని, వేధించాడని సోమవారం అర్ధరాత్రి పాండే ఫిర్యాదు చేశారు. అతన్ని అరెస్టు చేశాం’’ అని కనకోన పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుకారాం చవన్ వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. మరోవైపు, పూనమ్‌తో తీసుకున్న అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి సామ్ బోంబే తొలగించడం వారిద్దరి మధ్య ఏదో తేడా జరిగింది అనడానికి ఊతమిస్తోంది. పూనమ్ పాండే, సామ్ బోంబేల వివాహం పది రోజుల క్రితం జరిగింది. తనకు పెళ్లయిన విషయాన్ని, భర్తతో తాను తీసుకున్న ఫొటోలను పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే, గోవాలో హనీమూన్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేశారు. గోవాలో ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు భర్తతో పాండే హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తుందని అంతా భావించారు. కానీ, అక్కడ ఏదో జరిగింది. అసలు పాండేను సామ్ వేధించడానికి కారణం ఏంటి.. అసలు అక్కడ ఏం జరిగింది? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. Also Read:


    from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mKgonO
    v

    No comments:

    Post a Comment

    చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

    చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...