గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా నుంచి కోలుకోవాలని పాటను ఇష్టపడే ప్రతి ఒక్కరు దేవుళ్లకు మొక్కుతున్నారు. కరోనా సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలు.. ఆగష్టు 5 నుంచి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే . అయితే గత రెండు మూడు రోజులుగా ఆయన పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ సపోర్ట్తో బాలుకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని.. ఆయన శరీరం ట్రీట్ మెంట్కి సహకరిస్తుందని ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో పాటలకు తన గానంతో ఊపిరి పోని బాలు ఊపిరి ఆగకూడదని ఆయన అభిమానులతో పాటు సెలబ్రిటీలు దేవుళ్లకు మొక్కుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ స్పందిస్తూ.. ‘బాలు సార్.. మీకోసం పార్ధిస్తున్నాం.. మీరు త్వరగా కోలుకోవాలి.. ఈ కఠినమైన సమయంలో మీ కుటుంబానికి మా ప్రార్థనలు బలాన్ని చేకూర్చాలి' అని మహేష్ ట్వీట్ చేశారు మహేష్ బాబు. కాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు చరణ్ స్పందిస్తూ.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. గురవారం నాడు విషమంగా ఉన్నా.. నేడు కోలుకున్నారు. వైద్య సిబ్బందిపై పూర్తి నమ్మకం ఉందని.. మా నాన్న కోసం ప్రార్ధిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ వీడియో విడుదల చేశారు ఎస్పీ చరణ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hm3ysT
v
No comments:
Post a Comment