Monday, 10 August 2020

చిరంజీవి చేసిన కట్టి పరిగెలు, చింతతొక్కు వేపుడు.. అమ్మ కోసం అమ్మ నేర్పిన వంటకం

లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటోన్న మెగాస్టార్ అప్పుడప్పుడు కిచెన్‌లో గరిట తిప్పుతున్నారు. ఇప్పటికే తల్లి అంజనాదేవికి పెసరట్లు వేసి పెట్టిన చిరు.. తాజాగా అమ్మ కోసం అమ్మ నేర్పిన వంటకాన్ని వండి వడ్డించారు. వంటకం అదిరిందని అమ్మ కితాబు ఇవ్వడంతో చిరంజీవి మురిసిపోయారు. ఇంతకీ ఆ వంటకం ఏంటంటే.. గోదావరి జిల్లాల్లో వండే కట్టి పరిగెలు (చిన్న చేపలు), చింతతొక్కు వేపుడు. ఈ కట్టి పరిగెల వేపుడు అమ్మకు చేసి పెట్టడమే కాకుండా.. ఎలా చేయాలో వీడియో రూపంలో తెలుగు ప్రేక్షకులకు వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఈ వేపుడు వీడియోను ఆదివారం సాయంత్రమే విడుదల చేస్తానని చిరంజీవి మొదట ప్రకటించారు. కానీ, విజయవాడ అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో వాయిదా వేశారు. ఆ వీడియోను సోమవారం ఉదయం రిలీజ్ చేశారు. చెప్పినట్టుగానే చింత తొక్కుతో చిన్న చేపలను మారినేట్ చేసి, వాటిని ఎంతో నేర్పుగా వేపుడు చేసి తల్లికి వడ్డించారు. తన చేతి వంటను ఎంతో ఇష్టంగా తింటున్న మాతృమూర్తిని చూస్తూ చిరంజీవి మురిసిపోయారు. Also Read: ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. మేట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరవాత వరుస ప్రాజెక్టులతో చిరంజీవి బిజీ కానున్నారు. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరంజీవి నటించనున్నారు. అలాగే, మెహర్ రమేష్ దర్శకత్వంలో కేఎస్ రామారావు నిర్మించే సినిమాలోనూ చిరంజీవి హీరో అని ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PEaoxR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...