Monday, 3 August 2020

దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్.. అందరికీ జాగ్రత్తలు చెప్పి..!!

తెలుగు సినిమా పరిశ్రమలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మాత్రమే కాకుండా ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇటీవల దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా కుటుంబం మొత్తానికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఒక వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొనడానికి ముంబై వెళ్లినట్టు సమాచారం. అక్కడే వైరస్ సోకి ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే, తేజకు మాత్రమే కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని.. కుటుంబంలో మిగిలిన సభ్యులందరికీ నెగిటివ్ వచ్చిందని తెలిసింది. తన కుటుంబ సభ్యులకు నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారట. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని సమాచారం. Also Read: నిజానికి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తేజ ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మనం ఎప్పుడెప్పుడు చేతులకు శానిటైజేషన్ చేసుకోవాలో, మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో తేజ వివరించారు. ప్రజలకు ఇన్ని జాగ్రత్తలు చెప్పిన తేజ.. ఇప్పుడు ఆయనే ఆ మహమ్మారి బారిన పడటం బాధాకరం. ఇదిలా ఉంటే, తేజ చివరిగా దర్శకత్వం వహించిన సినిమా ‘సీత’. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్, సోనూ సూద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D7jL6y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...