Thursday, 20 August 2020

మరోసారి కత్తి మహేష్ అరెస్ట్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు.. కారణమిదే!

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై వివాదాస్పద ఆరోపణలు రావడం, పోలీసులు రంగంలోకి దిగడంతో మరోమారు వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టడంతో గత కొద్దిరోజుల క్రిందటే కత్తి మహేష్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘రాముడు కరోనా ప్రియుడు’ అని పోస్ట్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన పోలీసులు కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ ‌కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్న కత్తి మహేష్‌‌ను తాజాగా పీటీ వారెంట్‌పై మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Also Read: ఫిబ్రవరి నెలలో కూడా ఇలాగే సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ జింబాగ్‌కు చెందిన ఉమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు మరోసారి కత్తి మహేష్‌ని అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ విషయాన్ని సైబర్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు వెల్లడించారు. కత్తి మహేష్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. 2018లోనూ రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో నగర బహిష్కరణ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా అతడు హైదరాబాద్‌ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీచేశారు. మళ్ళీ ఇప్పుడు కత్తి మహేష్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తుండటం పలు వివాదాలకు దారి తీస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qda2yg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...