Tuesday, 18 August 2020

అనుష్క, కోన కాంప్రమైజ్.. ‘నిశ్శబ్దం’ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్!

ప్రధాన పాత్ర పోషించిన ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలకు సిద్ధమై చాలా రోజులే అయ్యింది. లాక్‌డౌన్, కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ‘నిశ్శబ్దం’ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ఖండించారు. కానీ, అదే నిజమని తేలింది. ‘నిశ్శబ్దం’ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైందని సమాచారం. ‘నిశ్శబ్దం’ నిర్మాతలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ‘నిశ్శబ్దం’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోకు సుమారు రూ.25 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. అయితే, మొదట్లో ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయడం అనుష్కకు గానీ, కోన వెంకట్‌కు గానీ ఇష్టం లేదట. కానీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వారిని ఒప్పించి ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యారని తెలిసింది. Also Read: సెప్టెంబర్ రెండో వారంలో ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పనులను అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే ప్రారంభించిందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా.. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ‘నిశ్శబ్దం’ రూపొందింది. మరి, కేవలం తెలుగు డిజిటల్ రైట్స్ మాత్రమే విక్రయించారా? లేక ఇతర భాషల డిజిటల్ రైట్స్‌ను కూడా అమ్మేశారా? వంటి విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ్‌స‌న్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, త‌దిత‌రులు నటించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. కథ, దర్శకత్వం హేమంత్ మధుకర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q2ij8n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...