Wednesday, 19 August 2020

‘ఆదిపురుష్’పై కృష్ణంరాజు ఎక్స్‌క్లూజివ్.. వెయ్యి కోట్లు బడ్జెట్, ప్రభాస్ స్కెచ్ ఇదీ.. కథ లీక్

చిత్రం ప్రకటించగానే ఈ సినిమాతో బాలీవుడ్‌ని ఏలేయడం ఖాయం అని ఆయన అభిమానులు సంబరం పడుతున్నారు. అయితే ప్రభాస్ పెదనాన్న ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు వింటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ కాదు.. అంతకు మించే సంబరాలు చేసుకుంటారు. అసలు ప్రభాస్ ఈ చిత్రంతో ఏం చేయబోతున్నారో.. అతని టార్గెట్ ఏంటో రివీల్ చేశారు కృష్ణంరాజు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ అంటే విష్ణుమూర్తి.. ఆయన అవతారాల్లో ఆది పురుష్ అనేది ఒక అవతారం. సోసియో ఫాంటసీ కథతో పెద్ద ఎత్తున పెద్ద బడ్జెట్‌తో సినిమా తీయాలని సంకల్పించారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు.. బాగుంది ఖచ్చితంగా చేద్దాం అన్నాడు. ఈ సినిమా కథ నేను కూడా విన్నాను.. నాకు బాగా నచ్చింది.. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇది కేవలం నాలుగు లాంగ్వేజ్‌లు మాత్రమే కాదు.. హాలీవుడ్‌కి కూడా తీసుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నాం. ఆలిండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తాం. నరేంద్ర మోడీ గారు.. ఈ మధ్యనే అయోధ్య రామాలయాన్ని శంకుస్థాపన చేశారు.. రాముడి కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ సబ్జెక్ట్ తెరపైకి రావడం చాలా గొప్ప విషయం. మొత్తం ప్రపంచం ఆశ్చర్య పోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ని పెట్టడం వల్ల పెద్ద ఎలివేషన్ రావడానికి ప్యాన్ ఇండియా చిత్రాల్లో గొప్ప సినిమా కావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అంత గొప్ప చిత్రం అవుతుంది కూడా. ఆది విష్ణువుపై ఈ సినిమా ఉండబోతుంది. ఆయితే దశావతారాలు ఉంటాయా? లేక ఆదిపురుష్ అవతారం మాత్రమే ఉంటుందా? అన్నది మేకర్స్ ఫస్ట్ లుక్‌లో క్లారిటీ ఇస్తారు. ఇది ఇతిహాసగాధ అని పోస్టర్‌లోనే ఉంది. పురాణాలకు సంబంధించిన కంటెంట్‌తోనే ఈ సినిమా ఉంటుంది. దాదాపు ఈ సినిమా వెయ్యి కోట్లు బడ్జెట్ ఉండబోతుంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లాడు.. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ హీరో అనిపించుకోబోతున్నాడు ప్రభాస్. మన పురాణాలు, ఇతిహాసాల గొప్పతనం ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రపంచానికి తెలియజెప్పబోతున్నాడు ప్రభాస్. నా కోరిక ఏంటంటే.. బాహుబలి సినిమా చూసిన తరువాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అయితే బాహుబలి చిత్రంతోనే ఆ మార్క్ ప్రభాస్ దాటేశాడు.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌‌కి వెళ్లాలని అనుకుంటున్నాడు. అలాగే ప్రభాస్‌తో నా కోరిక చెప్పాను.. నీతో కలిసి బ్లవర్లీ హిల్స్‌లో భోజనం చేయాలని. బ్లవర్లీ హిల్స్‌లో భోజనం అంటే.. అక్కడ ఓన్లీ హాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకే అక్కడ ప్రభాస్‌తో కలిసి భోజనం చేయాలని ఉందనే కోరిక కోరాను. అందులో ప్రభాస్‌కి కూడా ఒక బిల్డింగ్ ఉండాలి.. నేను అక్కడ ప్రభాస్‌తో కలిసి భోజనం చేయాలి. త్వరలోనే ఆ కోరిక తీరబోతోంది. ప్రభాస్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ ఆదిపురుష్ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు హీరో కృష్ణంరాజు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CGkCL3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...