Monday, 24 August 2020

Balasubrahmanyam: ఎస్పీ బాలు కోసం కేఏ పాల్ ఆన్ లైన్ ప్రేయర్

కరోనా సోకడంతో ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని అన్ని మతాల వారు ప్రార్ధనలు చేస్తున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆగష్టు 5 నుంచి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే ఉంది. అయితే ఆయన కరోనా నుంచి కోలుకున్నారని.. కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని వార్తలు రాగా.. అవన్నీ పుకార్లే అని ప్రస్తుతం నాన్న పరిస్థితి సీరియస్‌గా ఉందని బాలు క్షేమ సమాచారాన్ని తెలియజేశారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్. ఈ తరుణంలో కోట్లాదిమంది ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తుండగా.. ప్రముఖ అంతర్జాతీయ సువార్తీకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సైతం ఎస్పీ బాలు కోసం ఆన్ లైన్ ప్రేయర్స్ నిర్వహిస్తున్నారు. దేవుడ్ని స్తుతిస్తూ.. అనేక మందిని తన పాటల ద్వారా క్రీస్తులోకి నడిపించిన ఎస్పీ బాలు కోలుకోవాలని కేఏ పాల్ ప్రార్ధన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్స్ నేను ఉన్న దగ్గర పగలు.. బహుషా ఇండియాలో రాత్రి ఒకటి అయ్యి ఉంటుంది. అయితే సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయమని అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నారని.. ప్రాణం పోయే పరిస్థితికి వచ్చారని తెలిసింది. ఆయన శాంతి సందేశం లీడ్ సాంగ్ పాడారు. ఆ సందర్భంలో నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారాయన. 74 ఏళ్లు అయినప్పటికీ.. దేవుని చిత్తమైతే ఆయనకు మిరాకిల్ జరగాలి. ప్రాణం పోయే పరిస్థితిలో ప్రాణం పోయాలని మనం ప్రార్ధిద్దాం. ఒకవేళ దేవుని చిత్తమై ఆయన చనిపోతే దేవుని దగ్గరకు వెళ్లాలి.. స్వర్గానికి వెళ్లాలని ప్రార్థిద్దాం.. ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని తిరిగి పాటలు పాడాలని దేవుడు అద్భుత కార్యం జరిగించాలి’ అంటూ ఆన్ లైన్‌లో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేశారు కేఎ పాల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3giV2tq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...