మరో సంచలన ప్రకటన చేశారు వివాదాల దర్శకుడు . ఫిక్షనల్ మూవీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ‘పవర్ స్టార్’ మూవీని విడుదల చేశారు వర్మ. ఈ చిత్రాన్ని శనివారం నాడు ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్’లో విడుదల చేసిన వర్మ.. టికెట్ రేటు రూ. 250 ఆన్ లైన్లో వసూలు చేస్తున్నారు. అయితే నిన్నటి వరకూ రూ. 150 ఉన్న ఈ టిక్కెట్ ధర.. ఈరోజు నుంచి రూ. 250కి పెంచేశారు. అయితే అన్ని టాక్స్లు కలుపుకుని ఆర్జీవీ వరల్డ్లో ‘పవర్ స్టార్’ సినిమా ఒక్కసారి చూడాలంటే.. రూ. 295 వసూలు చేస్తున్నారు వర్మ. Read Also: మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి శివ సినిమా ఎలాగో.. ఆన్ లైన్ థియేటర్కి ‘పవర్ స్టార్’ మూవీ అలా అని.. ఇంత డబ్బు పెట్టి సినిమా చూడటం ‘పవర్ స్టార్’ సినిమాకే సాధ్యం అయ్యిందంటూ వర్మ తెగ పొంగిపోతున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటి వరకూ ఎంత మంది చూశారు.. ఎంత డబ్బు వచ్చిందో చెప్తే చాలా మంది గుండె ఆగి చచ్చిపోతారని.. వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లెక్కలు చెప్పను అంటున్నారు వర్మ. ఇక ఫ్యాన్స్ని మరింత రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్పై ఇదొక్కటే కాదు.. వరుసగా ఐదు సినిమాలు చేస్తున్నా అంటూ సంచలన ప్రకటన చేశారు వర్మ. ‘పవర్ స్టార్’ చిత్రానికి కంటిన్యూగా ఇది ఉంటుందా..? లేదంటే అందులో పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను త్వరలోనే తెలియజేస్తా అన్నారు వర్మ. అయితే ‘పవర్ స్టార్’ సినిమాని చూడొద్దని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రచారం చేయడం పట్ల వర్మ స్పందిస్తూ.. ఇది ఫిక్షనల్ స్టోరీ పవన్ కళ్యాణ్ గురించి కాదని వందల సార్లు చెప్పా.. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తలకి ఎక్కడం లేదు.. వాళ్లకు ఇష్టం ఉంటే చూడమనండి లేదంటే మానేయమనండి.. నేను మాత్రం ‘పవర్ స్టార్’ మీద సినిమాలు తీస్తూనే ఉంటా అని చెప్పారు వర్మ. ఒక్క చిత్రంతోనే ఆఫీస్లు పగలగొట్టించుకుని పోలీస్ కేసుల వరకూ వెళ్లిన వర్మ.. మరో ఐదు చిత్రాలు అంటూ సంచలన ప్రకటన చేశారు.. మరి ఇవి ఎంత వివాదాన్ని రాజేస్తాయో చూడాలి. Read Also:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39ssmfx
v
No comments:
Post a Comment