Saturday, 4 July 2020

ఆలియా, మహేశ్ భట్ సినిమాపై కేసు నమోదు

బాలీవుడ్‌ సినిమా 'స‌డ‌క్-2' పోస్ట‌ర్ పై కేసు నమోదు అయ్యింది. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉందంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ కోర్టులో కేసు నమోదయింది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్‌తో పాటు నిర్మాత‌ ముఖేశ్ భ‌ట్, న‌టి ఆలియా భ‌ట్‌పై సెక్ష‌న్ 120బీ, 295ఏ కింద సికంద‌ర్‌పూర్‌కు చెందిన ఆచార్య‌చంద్ర కిషోర్ అనే వ్య‌క్తి ఈ కేసు న‌మోదు చేశారు. సడక్ 2 పోస్టర్‌లో కైలాస మానస సరోవర్‌కు సంబంధించిన ఫోటోను వాడారని ఆయన ఆరోపించారు. ఇది హిందువుల మనోభవాల్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. 1991 సంవ‌త్స‌రంలో విడుద‌లైన 'స‌డ‌క్' సినిమాకి సీక్వెల్‌గా సడక్2 సినిమాను తీస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వం వహిస్తూ కూతురు ఆలియాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పూజా భ‌ట్, సంజ‌య్ ‌ద‌త్ కూడా ప్ర‌ధాన ‌పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను మూడు రోజుల క్రితం విడుద‌ల చేశారు. యంగ్‌ హీరో సుశాంత్ ఆత్మహత్యకు నెపోటిజమే కార‌ణ‌మంటూ ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తితో మ‌హేశ్ భ‌ట్ స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూతురు ఆలియాతో మ‌హేశ్ భ‌ట్ తీస్తోన్న ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఆయ‌న‌పై నెటిజ‌న్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సుశాంత్ పై గతంలో చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆలియా సినిమాలు కూడా బాయ్ కట్ చేయాలని పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు ఆలియా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల నుంచి రెండు లక్షల మంది అన్ ఫాలో కూడా అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38sElJJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...