Wednesday, 1 July 2020

మరో సీరియల్ నటికి కరోనా.. నవ్య స్వామి రియాక్షన్ చూడండి.. అంతా ఓపెన్‌గా చెప్పేసింది

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత దేశాన్ని సైతం అతలాకుతలం చేసేస్తోంది. కరోనా కాటుకు యావత్ భారత దేశం బలైపోతోంది. చిన్న- పెద్ద, బీధ- ధనిక అనే తేడా లేకుండా ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి కారోనా పాజిటివ్ అని తెలుస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతుండటం జనాల్లో కంగారు పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇద్దరు టీవీ నటులకు కరోనా పాజిటివ్ రావడం బుల్లితెర వర్గాలను ఓ కుదుపు కుదిపేసింది. ఆ తర్వాత యాంకర్ ఓంకార్ కూడా కరోనా బారిన పడ్డారని విన్నాం కానీ అది నిజం కాదని తెలిసింది. ఇక మరో సీరియల్ నటి (ఆమెకథ ఫేమ్) నవ్య స్వామికి కూడా కరోనా సోకిందంటూ గత రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నప్పటికీ క్లారిటీ రాలేదు. Also Read: ఈ నేపథ్యంలో ఇట్టి వార్తలపై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో ద్వారా తనకు కరోనా సోకిన మాట వాస్తవమే అని చెప్పేసింది నటి . గత మూడు, నాలుగు రోజులుగా తలనొప్పి, అలసట ఉండటంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలిందని ఆమె తెలిపింది. అయితే ఈ విషయాన్ని చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన, భయపడాల్సిన పని లేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం పౌష్టికాహారం తీసుకుంటూ సెల్ఫ్ ఇసోలేషన్‌లో (ఎవ్వరినీ కలవకుండా) విడిగా ఉంటున్నానని, అంతకుముందు తనతో కాంటాక్ట్ అయిన వారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే కోవిడ్-19 టెస్ట్ చేయించుకోండని నవ్య స్వామి చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f4Wpw9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...