ఫేమస్ కొరియోగ్రాఫర్ (71) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాస కోస సమస్యలతో జూన్ 20వ తేదీన బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూయడంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సరోజ్ఖాన్ తన ఇన్స్టాగ్రామ్లో చివరగా చేసిన పోస్ట్ అందరినీ మరింత ఉద్వేగానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సరోజ్ ఖాన్ చివరగా జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై రియాక్ట్ అయింది. ఇదే ఆమె చేసిన చివరి సోషల్ మీడియా పోస్ట్. ఈ పోస్టులో సుశాంత్ గురించి తన అభిప్రాయాన్ని తెలిపింది సరోజ్ ఖాన్. సుశాంత్, నేను కలసి పనిచేయకపోయినా చాలాసార్లు కలుసుకున్నామని, ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో షాక్ అయ్యానని ఆమె పేర్కొంది. Also Read: ''దేవుడు మీ ఆత్మకు శాంతి చేకూర్చుగాక. మీ మరణం పట్ల సంతాపం తెలుపుతూ మీ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్న. మీ అన్ని సినిమాల్లోనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాను'' అని సుశాంత్ని ఉద్దేశిస్తూ సరోజ్ ఖాన్ పెట్టిన పోస్ట్ ఆమె మరణం తర్వాత వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ పెట్టిన 20 రోజుల్లోనే సరోజ్ ఖాన్ ఈ లోకాన్ని విడిచివెళ్లటం కన్నీళ్లు పెట్టిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZC9Ug0
v
No comments:
Post a Comment