ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సౌత్ ఇండియన్ ఆడియన్స్ని ఉర్రూతలూగిస్తోంది మిల్కీ బ్యూటీ . సినిమా ఛాన్సులతో పాటు స్పెషల్ సాంగ్స్ చేయడానికీ రెడీ అంటున్న ఈ ముద్దుగుమ్మతో ఓ టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారట బడా నిర్మాత అల్లు అరవింద్. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిగిన ఆయన.. తన ఆహా ఓటీటీ వేదికపై ఈ షోని ప్రసారం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు జిటల్ మాధ్యమానికి, ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతుండటం గమనించిన తమ్మూ.. డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఆహా వేదికగా నడవనున్న ఈ టాక్ షోకి తమన్నా హోస్ట్గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందని ఫిలిం నగర్ టాక్. Also Read: ఇకపోతే తమన్నా చేసే ఈ టాక్ షోలో వేరే సెలబ్రెటీలు, స్టార్ హీరోలు సైతం భాగం కానున్నారనేది లేటెస్ట్ సమాచారం. , రవితేజ, లాంటి స్టార్ హీరోలు తమన్నాతో ముచ్చటించేందుకు రెడీ అవుతున్నారట. ఇదంతా కూడా అల్లు అరవింద్ ఆలోచనే అని తెలుస్తోంది. ఈ షో కోసం తమన్నా రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ప్రస్తుతం తమన్నా.. గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని అతిత్వరలో ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. దీంతో పాటు తమన్నా లీడ్ రోల్ పోషించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/383jhcC
v
No comments:
Post a Comment