Monday, 8 June 2020

చిరంజీవి మృతి అంటూ రచయిత్రి షాకింగ్ పోస్ట్.. మెగా ఫ్యాన్స్ రచ్చరచ్చ.. ఇష్యూ సీరియస్

జూన్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ మేనల్లుడు సర్జా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నటుడికి కన్నీటి నివాళులు అర్పించారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ చిరంజీవి సర్జా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రచయిత్రి చేసిన ట్వీట్ చూసి ఒక్కసారిగా షాకైన మెగా ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. చిరంజీవి సర్జా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయడంలో భాగంగా పెద్ద పొరపాటు చేశారు రచయిత్రి శోభా డే. ఆయన మృతిపై ట్విట్టర్‌లో శ్రద్దాంజలి ఘటిస్తూ.. మరో యువ నటుడు ఈ లోకం నుంచి వెళ్లిపోయారని, ఈ విషాద కరమైన వార్త షాక్ గురించి చేసిందని అన్నారు. ఆయన మరణం పూడ్చలేనిదని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని పోస్టు పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ట్వీట్‌లో చిరంజీవి సర్జా ఫోటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి పరేషాన్ చేశారు. Also Read: దీంతో ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్.. వెంటనే ఆమెపై విరుచుకుపడటం స్టార్ట్ చేసి ఓ రేంజ్ కామెంట్స్ చేశారు. ''అరే శోభా మేడమ్. రెండు పెగ్గులు మద్యం తాగి ఇలా ట్వీట్స్ చేస్తే ఎలా?, చిరంజీవి సర్జాకు బదులు చిరంజీవి చనిపోయారంటూ ఫోటో పెట్టిన నువ్వు ఎంత పెద్ద మేధావి అనే విషయం అర్థమవుతోంది'' అంటూ రెచ్చిపోయారు. ఇలాంటి ట్వీట్ చేసిన గొప్ప రచయిత్రిని ఊరికే వదలకుండా.. సగౌరవంగా సన్మానించాలి. ఈమెను పర్సన్ ఆఫ్ దిస్ టెర్రిబుల్ ఇయర్‌గా నామినేట్ చేయాలంటూ రచ్చరచ్చ చేశారు మెగా ఫ్యాన్స్. దీంతో ఈ ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dIK8MR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...