దేశంలో కోరలు చాస్తున్న మహమ్మారి వేలాదిమందికి కబళిస్తోంది. పెద్దాచిన్న, పేద- ధనిక అనే తేడా లేకుండా ప్రతిఒక్కరికీ కరోనా వైరస్ అనేది ప్రధాన సమస్యగా మారింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే లక్షా 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క మహారాష్ట్రలోనే 62 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వారిలో రెండువేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఉన్న ఖుష్బూ బంధువు కరోనా సోకి మృతి చెందడంతో శోకతప్తులయ్యారు. కుష్బూ సమీప బందువుకు ఇటీవలే కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారట. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణం సంబవించిందని సమాచారం. ఈ విషయాన్ని కుష్బూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. దీంతో పలువురు సినీరంగ ప్రముఖులు, ఆమె అభిమానులు ఓదార్చుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఆ బంధువు ఎవరు? ఏంటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కూడా సోమవారం తెల్లవాడుజామున కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై కూడా స్పందించిన కుష్బూ.. ఆ వార్త విని షాకయ్యానని, గత రెండు నెలలుగా చిత్రసీమలో చోటు చేసుకుంటున్న మరణాలు బాధపెడుతున్నాయని పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XQjwD0
v
No comments:
Post a Comment