వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సూపర్ ఫామ్లో ఉన్న .. మరోసారి ప్రేక్షకులను హుషారెత్తించే ప్రాజెక్టుతో రాబోతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ తర్వాత ''తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసి అతి త్వరలో సెట్స్ మీదకు రానున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సర్కారు వారి పాట' రెగ్యులర్ షూటింగ్కి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకొచ్చింది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన అన్ని షూటింగ్స్ అతిత్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మహేష్ సినిమా 'సర్కారు వారి పాట'ను సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. స్క్రిప్ట్కి మరిన్ని మెరుగులు దిద్ది కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్ షూట్కి రావాలని ఫిక్స్ అయ్యరట మహేష్ అండ్ టీమ్. Also Read: మరోవైపు ఇటీవలే విడుదలైన 'సర్కారు వారి పాట' ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మెడపై రూపాయి టాటూతో ఉన్న మహేష్ మాస్ లుక్ చూసి ఫిదా అయ్యారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XyStgt
v
No comments:
Post a Comment