Saturday, 27 June 2020

షాకింగ్ న్యూస్.. అద్దెకు రామోజీ ఫిల్మ్ సిటీ! సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకేనా..?

యావత్ భారత దేశాన్ని కరోనా కకావికలం చేసేసింది. ఈ కరోనా మహమ్మారి ప్రభావం చిన్న- పెద్ద, పేద- ధనిక అనే లేకుండా అన్నివర్గాల ప్రజలపై పడింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. థియేటర్స్, షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడే బంద్ కావడంతో సినీ పరిశ్రమ, దానికి అనుబంధ వర్గాలు కుదేలయ్యాయి. ఈ పరిస్థితుల్లో యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో దాదాపు నాలుగు నెలలుగా రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. సినీ, టీవీ షూటింగ్స్ లేక ఫిల్మ్ సిటీ వెలవెలబోతోంది. కొన్ని నెలలుగా పనులేమీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ నో వర్క్-నో పే విధానాన్ని అమలు చేసినట్లు తెలిసింది. ఇకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ అద్దెకు ఇస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తుండటం మరింత ఆశ్చర్యపరుస్తోంది. Also Read: రామోజీ ఫిల్మ్ సిటీని మూడేళ్ళ పాటు హాట్ స్టార్-డిస్నీకి అద్దెకు ఇచ్చారనే సమాచారాలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. కరోనా ఖతం అయ్యేది ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేకపోవటంతో ఆర్ధిక లోటు నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి వచ్చేందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరోవైపు డిస్నీ కూడా ఫిల్మ్ సిటీని పర్యాటక పరంగా, సినీ షూటింగ్‌ల కోసం ఉపయోగించుకోనుందని ఆంగ్ల మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చూడాలి మరి ఇలాంటి వార్తలపై రామోజీ గ్రూప్ ఎలా రియాక్ట్ అవుతుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31l17BD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...