Saturday, 27 June 2020

గుడ్ బై సుశాంత్ అంటూ ఫ్యామిలీ స్టేట్‌మెంట్.. కీలక ప్రకటన

బాలీవుడ్ నటుడు ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటుడు ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఎవ్వరూ జీర్ణించుకోలేక పోయారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినపుడు ఆయన ఇంట్లో సూసైడ్ నోట్ లభించకపోవడం, పైగా ఎలాంటి ఆధారాలు కూడా దొరకకపోవడంతో ఈ ఇష్యూ ఎన్నో చర్చలను లేవనెత్తింది. సుశాంత్ డెత్ మిస్టరీపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో '' అంటూ ఆయన కుటుంబ సభ్యులు అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని‌ ద్వారా సినిమా, సైన్స్, స్పోర్ట్స్ త‌దిత‌ర రంగాల్లో ప్ర‌తిభ‌చాటే యువ‌త‌కు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. అంతేగాక బీహార్‌లోని పాట్నాలో ఉన్న సుశాంత్ చిన్ననాటి ఇంటిని ఆయన స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు ఆ స్టేట్‌మెంట్ ద్వారా వెల్లడించారు. Also Read: సుశాంత్ వ్యక్తిగత వస్తువులతో పాటు ఆయన చదివిన పుస్తకాలు మొదలైనవి ఆ ఇంటిలో ఉంచనున్నామని తెలిపారు. అలాగే సుశాంత్ సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్,ఫేస్‌బుక్ పేజీలను కూడా తామే నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ స‌‌భ్యులు పేర్కొన్నారు. సుశాంత్ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఖాతాలను నిర్వహించనున్నామని చెప్పారు. దీంతో సుశాంత్ ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2A9hciP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...