Friday, 5 June 2020

‘గులాబి’ మ్యూజిక్ డైరెక్టర్‌కి గుండెపోటు.. 24 ఏళ్లుగా ఆయన పాట సంచలనం

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు హార్ట్ ఎటాక్‌కి గురయ్యారు. గురువారం ఉదయం ఆయన తీవ్ర గుండెనొప్పితో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషమూ నేనూ’., ‘మేఘాలలో తేలిపోమ్మన్నద్ది.. తూఫానులా రేగిపోమ్మనద్దీ’., ‘ఏ రోజైతే చూశానో నిన్నూ’., ‘డ్రీమ్ గర్ల్..’,.. గత 24 ఏళ్లు ఏదో ఒక మూల గులాబి చిత్రంలోని ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. యూత్‌లో అయితే చాలా మంది కాలర్స్ ట్యూన్స్, రింగ్ టోన్స్‌గా గులాబి చిత్రంలోని పాటలే ఉన్నాయంటే అవి సంగీత ప్రియుల్లో ఎంత నాటుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. సంగీత ప్రపంచంలో సంచలనంగా మారిన గులాబి చిత్రానికి సూపర్ హిట్స్ సాంగ్స్ అందించింది . గులాబి, సముద్రం, రాఘవ చిత్రాలకు సంగీతం అందించిన ఈయన తెలుగులో చేసినవి చాలా తక్కువే అయినా.. టెక్నికల్‌గా చాలా మందికి మెళుకువలు నేర్పించారు. సౌండ్ రికార్డింగ్, రిథమ్, ట్యూన్ రికార్డింగ్‌లో ఈయన చాలా సీనియర్. ఇప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌తో పాటు చక్రి, అనూప్ రూబెన్స్‌లు ఈయన దగ్గర పనిచేశారు. బాలీవుడ్ చిత్రాలకు సైతం మ్యూజిక్ అందించారు శశి ప్రీతమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XAkqEL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...