యంగ్ రెబర్ స్టార్ వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే 'సాహో' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ విషయమై స్వయంగా కేర్ తీసుకుంటున్నట్లు టాక్. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆయన.. ఇటీవలే 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లోని గత రికార్డులను చెరిపేయాలని ఆయన పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ప్రభాస్ కోసం భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశారట. 400 కోట్లతో ఈ కథను రూపొందించేందుకు బడా నిర్మాత అశ్వినీ దత్ సిద్ధమయ్యారు. ఈ మూవీ ప్రకటన వచ్చిన నాటినుంచే ప్రభాస్ అభిమానుల్లో ఆత్రుత మొదలైంది. కాగా ఈ సినిమాను నవంబర్ నెలలో సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. హీరోయిన్, ఇతర నటీనటుల విషయమై ఫైనల్ డిసీజన్ తీసుకుంటున్నారట. Also Read: ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ని తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపి భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది. ముందుగా దీపికా పదుకొనెను తీసుకుందామని అనుకున్న చిత్రయూనిట్.. చివరకు ఆలియానే ఫైనల్ చేశారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆలియా.. రామ్ చరణ్ సరసన RRR మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ మూవీ కూడా ఓకే అయితే తెలుగులో ఆమెకిది రెండో సినిమా అవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zte6Ab
v
No comments:
Post a Comment