కరోనా విలయతాండవంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ () ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ద్వారా సినీ పరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఛారిటీ ద్వారా చేయాల్సిన పనులు, భవిష్యత్ ప్రణాళిక, అదేవిధంగా సీఎం కెసిఆర్తో మీట్కి తనను పిలవలేదని ఇటీవల చేసిన వ్యాఖ్యల విషయమై నేడు (శుక్రవారం) చిరంజీవి ఇంట్లో కరోనా క్రైసిస్ చారిటీ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ సమావేశంలో సినీ ప్రముఖులు ఏమన్నారు? వారు తీసుకున్న నిర్ణయాలేంటి? అనే అంశాలు చూస్తే.. సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్, చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే నెల (జూన్ నెల)లో కూడా సినీ కార్మికులకు సహాయం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన నిర్మాత సి. కళ్యాణ్.. ఇందులో ఏ వివాదం లేదని స్పష్టం చేశారు. అందరినీ పిలవాలని రూల్ లేదని, బాలకృష్ణతో పాటు చాలా మంది హీరోలను పిలవలేదని అన్నారు. బాలకృష్ణ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం అని చెప్పారు. Also Read: మాట్లాడుతూ.. ''పలానా వాళ్ళను పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. దాన్ని ఇష్యూ చెయ్యాల్సిన పని లేదు. మహేష్ బాబు, వెంకటేష్ ఇలా చాలా మందిని పిలవలేదు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటే అర్థం లేదు. బాలయ్య వ్యాఖ్యలు ఆయన పర్సనల్. అలాగే వ్యాఖ్యలు కూడా ఆయన పర్సనల్. బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఉంది అని అనుకోవటం లేదు. ఆయన అవసరం ఉన్నపుడు తప్పకుండా పిలుస్తారు. షూటింగ్స్ ఓపెనింగ్ చేసుకోవడానికి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సమావేశం అయ్యారే కానీ వేరే విధంగా కాదు'' అని పేర్కొన్నారు. ''కేసీఆర్ గారు చిరంజీవి, నాగార్జున లను లీడ్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. బాలకృష్ణ గారు ఎందుకు రియల్ ఎస్టేట్ మాట అన్నారో తెలియదు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాట్లాడుకునే మీటింగ్స్ జరిగాయి. ఒకటి రెండు రోజుల్లో CCC సరుకుల పంపిణీ జరుగుతుంది'' అని తమ్మారెడ్డి తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XEQLZX
v
No comments:
Post a Comment