Wednesday, 27 May 2020

ఎన్టీఆర్ జయంతి రేపే.. కీలక నిర్ణయం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతి రేపు (మే 28). ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తాతకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధివద్ద.. ప్రతి ఏడాది నివాళులు అర్పిస్తుంటారు. అయితే ఈ ఏడాది లాక్ డౌన్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్. లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో ఈసారి తాత సమాధి వద్దకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్. ప్రతి ఏడాది తెల్లవారుజామునే అన్నగారి సమాధి వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పింస్తుంటారు ఎన్టీఆర్. తాతతో ఆయన ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైనా సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈసారి తాత సమాధి వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే నివాళులు అర్పించనున్నారు ఎన్టీఆర్. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున.. తన అన్న కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శిస్తే జన సమూహాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్ఓ వంశీ శేఖర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా సందర్భంగా ప్రతి ఏటా ఆయన్ని గుర్తు చేసుకుంటూ భారీ ఎత్తున ‘మహానాడు’ నిర్వహిస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఈసారి లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో టెక్నాలజీ సాయంతో ‘మహానాడు’ని నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. ప్రతి ఏడాది అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా జరుపుకునే మహానాడునే ఈసారి జూమ్ యాప్ ద్వారా నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా మహానాడులో 14 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. 14 తీర్మానాలు ఆమోదించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3emOKZ1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...