Friday, 8 May 2020

ప్రేక్షకులను మెప్పించడం ఇకపై కష్టమే: రాజమౌళి

వినోదరంగంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు పెనుమార్పులే తీసుకొచ్చాయి. నిన్నమొన్నటి వరకు కొంత మందికి మాత్రమే పరిమితమైన అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు.. లాక్‌డౌన్ పుణ్యమా అనీ సినిమా ప్రేమికులందరికీ దగ్గరైపోయాయి. లాక్‌డౌన్ వల్ల ఇళ్లలోనే ఉంటున్న ప్రజలు ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆస్వాదిస్తున్నారు. కేవలం తెలుగు కంటెంట్‌ను మాత్రమే కాకుండా హాలీవుడ్ వంటి విదేశీ సినిమాలను కూడా చూసేస్తున్నారు. ఇదే విషయంపై టాలీవుడ్‌లోని పెద్దలంతా తాజాగా చర్చించారు. లాక్‌డౌన్ తరవాత ప్రేక్షకులు మరింత సెలెక్టివ్‌గా మారిపోయారు, కొత్త కాన్సెప్ట్‌ల కోసం వెతుకుతున్నారు. కాబట్టి, లాక్‌డౌన్ తరవాత ప్రేక్షకులను మెప్పించాలంటే సాదాసీదా కాన్సెప్ట్‌లు సరిపోవని తాజాగా నిర్వహించిన వెబినార్‌లో దర్శకులు అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ తరవాత ఎలాంటి కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలనే విషయంలో కూడా చర్చించారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన అభిప్రాయాలను తోటి దర్శకులతో పంచుకున్నారు. Also Read: ఈ వెబినార్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘సినిమాను నదిగా భావిస్తే ప్రస్తుతం దాని ప్రవాహ దిశ ఎలా మారిందో మనం గుర్తించగలగాలి. దర్శకులు కథలు చెప్పే విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఎందుకంటే వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించడం ప్రస్తుత సమయంలో చాలా ముఖ్యం. ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా అందుబాటులోకి వచ్చేసింది. దీని వల్ల ప్రేక్షకుల అంచనాలు మారిపోతాయి. వాళ్లను మెప్పించడానికి మనం మరింత కష్టపడాలి’’ అని అన్నారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఈ పాన్ ఇండియా మూవీని రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LfECok
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...