Wednesday, 27 May 2020

సినిమా షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్‌‌.. రేపు మరింత క్లారిటీ

కరోనా ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. రిలీజ్‌ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. అంతేకాదు, ఎప్పుడూ లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి. షూటింగ్‌లు నిలిచిపోవడంతో పాత ఎపిసోడ్‌లను రిపీట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూ ఉండడంతో సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడం, థియేటర్లను ఓపెన్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా ఇప్పటికే సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌తో చర్చలు జరపగా, బుధవారం మరోసారి సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి నిర్మాతలు సి. కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్‌ శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత తదితరులు హాజరయ్యారు. Also Read: ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తలసాని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని ప్రముఖులతో సమావేశం ఉంటుందని.. ఆ భేటీలోనే దీనిపై మరింత క్లారిటీ వస్తుందన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZIAPbM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...