కరోనాను కట్టడి చేసేందుకు గాను దేశవ్యాప్త లాక్ డౌన్ విధించి అందరినీ ఇంటికే పరిమితం చేసేసింది ప్రభుత్వం. షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో సెలబ్రిటీలంతా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తాజాగా అభిమానులతో టచ్ లోకి వచ్చిన యంగ్ హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి ఆకట్టుకుంది. మీతో కలిసి నటించిన హీరోలలో ఎవరితో స్వీయనిర్బంధంలో ఉండాలనుకుంటారు? ఆ అవకాశం వస్తే ఏ హీరో అయితే బెటర్ అనుకుంటున్నారు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందించిన పూజా.. తాను ఇప్పటిదాకా మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పనిచేశానని.. ఒకవేళ అవకాశం వస్తే అందరితో స్వీయ నిర్బంధంలో ఉండాలని ఉందని తెలిపింది. అలా కాకుండా ఒక్క హీరోతో అంటే మాత్రం ఆ ఛాయిస్ అని చెప్పి షాకిచ్చింది పూజా హెగ్డే. Also Read: చిన్నప్పటి నుంచే తనకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని, అతనే తన కలల హీరో అని చెప్పుకొచ్చింది పూజా. బాలీవుడ్లో తన తొలి సినిమా కూడా హృతిక్తోనే అని, అనేక విషయాల్లో ఆయననే స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది. స్వీయ నిర్బంధంలో ఉంటే ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటానని పూజ పేర్కొనడం విశేషం. టాలీవుడ్ టు బాలీవుడ్ హవా కొనసాగిస్తున్న పూజా హెగ్డే.. ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X9h2PZ
v
No comments:
Post a Comment