Tuesday, 19 May 2020

హిందూపురం ప్రజలకు బాలకృష్ణ సాయం.. కరోనా నియంత్రణకు రూ.25 లక్షలతో..

కరోనా సంక్షోభంలో ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు చేపడుతోన్న కార్యక్రమాలకు చేయూతగా నటసింహా నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.1.25 కోట్ల విరాళాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున, సినీ కార్మికుల సహాయార్థం ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ చారిటీకి రూ.25 లక్షలు అందజేశారు. అయితే, ఇప్పుడు మరోసారి ఆయన భారీ వితరణ కార్యక్రమం చేపట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గం ప్రజల సహాయార్థం ఆయన రూ.25 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను అందజేశారు. ఈ విషయాన్ని ఆయన వీడియో మెసేజ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మా బాలయ్య బంగారం’ అంటూ నందమూరి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘‘లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున, నేను హోమ్ క్వారంటైన్‌లో ఉండటం వల్ల హిందూపురం రాలేకపోయాను. రోజూ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, డాక్టర్స్‌తో ఫోన్ ద్వారా పరిస్థితులు సమీక్షిస్తున్నాను. హిందూపురంలో కేసులు పెరిగిపోవడం, కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుతో రోగులకు మెరుగైన చికిత్స అందించడం కోసం నా వంతుగా బసవతారకం ట్రస్ట్ ద్వారా రూ. 25 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, అలాగే వైద్య సిబ్బంది కోసం 100 వీపీ యూనిట్లు మావారి ద్వారా అందజేస్తాం. మీ అందరి సహాయ సహకారాలతో త్వరలోనే కరోనా లేని హిందూపురాన్ని చూద్దాం. స్టే హోం స్టే సేఫ్’’ అని వీడియోలో బాలకృష్ణ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g4CQok
v

No comments:

Post a Comment