Tuesday, 5 May 2020

సమంత అభిమానులకు సర్‌ప్రైజ్.. అలా ప్లాన్ చేసిన నాగచైతన్య.. ఇదీ క్లారిటీ!!

నాగచైతన్యతో పెళ్లి తర్వాత జోష్ రెట్టింపు చేసిన .. కెరీర్ పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పరాజయం అంటూ చవిచూడకుండా ముందుకు సాగుతోంది. అక్కినేని వారింట అడుగుపెట్టాక ఆమెకు అన్నీ విజయాలే తప్ప అపజయమంటూ లేదు. ''రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, యూ టర్న్'' లాంటి వరుస విజయాల తర్వాత ఇటీవలే వచ్చిన 'జాను' మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కానప్పటికీ ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఇదే జోష్‌లో సొంతంగా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోందట సమంత. ఈ మేరకు భర్తతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌కి అనుబంధ సంస్థగా మరో బ్యానర్ స్థాపించాలని డిసైడ్ అయిందట. కొంతకాలంగా ఈ ప్రయత్నాల్లోనే ఉన్న చైసామ్ జోడీ చివరకు అందుకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తమ సొంత బ్యానర్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్యానర్ ద్వారా నేటితరాన్ని అలరించేలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందించాలని చైసామ్ స్కెచ్ వేస్తున్నారట. ఈ క్రమంలో తమ బ్యానర్ లో మొదటి సినిమా చేయడానికి యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఫేమ్ శ్రీనివాస్ గావిరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ మూవీ రూపొందనుందని, ఇందులో అవికా గోర్ హీరోయిన్‌గా నటించనుందని ఫిలింనగర్ టాక్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xCYn6n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...