Thursday, 7 May 2020

తిండికి ఇబ్బందిపడే స్థితిలో మేం లేము: చక్రి సోదరుడి ఆవేదన

దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ ఈ లాక్‌డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్నారని, ఆయన కుటుంబానికి కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సినీ నిర్మాత డాక్టర్ అనూహ్య రెడ్డి సాయం అందించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అనూహ్య రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా మీడియాలో వార్తలను ప్రచురించారు. అయితే, కొన్ని వెబ్‌సైట్లలో చక్రి కుటుంబం తిండికి ఇబ్బందిపడుతోందని రాశారు. ఈ కథనాలు మహిత్‌ను బాధించాయి. దీంతో ఈ కథనాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. చక్రి కుటుంబం తిండికి ఇబ్బందిపడుతోన్న పరిస్థితి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని మహిత్ అన్నారు. ‘‘నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేను అని తెలిసి.. ఇంట్లో కొన్ని మెడిసిన్స్ అవసరమని వాటిని ఒక నిర్మాత నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఆవిడ మంచి మనసుతోనే ఇచ్చారు. నాతో కరోనా వైరస్‌పై ఒక పాట కూడా చేయించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఆమె మెడిసిన్స్ తదితరాలు నాకు అందించారు. దీన్ని మీడియా వక్రీకరించింది’’ అని మహిత్ వీడియోలో వెల్లడించారు. Also Read: తను, తన తల్లి, ముగ్గురు అక్కలు.. అందరం ఆనందంగా జీవిస్తున్నామని మహిత్ చెప్పారు. తిండికి లేని పరిస్థితి అయితే లేదన్నారు. లగ్జరీ లైఫ్ అనుభవించకపోయినా తమ స్తోమత మేర మంచి జీవితాన్నే గడుపుతున్నామని స్పష్టం చేశారు. తన తండ్రి పింఛను వస్తోందని.. అది కుటుంబ పోషణకు సరిపోతుందని చెప్పారు. తాను కూడా కొన్ని సినిమాలు చేస్తున్నానని.. తాను సంగీత సారథ్యం వహిస్తోన్న ‘పరారీ’ అనే సినిమా ఆడియో ఇటీవల విడుదలైందని మహిత్ తెలిపారు. తమ సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుందని.. తాము ఎవ్వరినీ యాచించడం లేదని మహిత్ చెప్పారు. ఇంకోసారి మీడియాలో తన కుటుంబం పట్ల తప్పుడు వార్తలు రాస్తే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని హెచ్చరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35IOYqj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...