Friday, 1 May 2020

బాలీవుడ్‌లో మరో విషాదం.. కుల్మీత్ మక్కర్ కన్నుమూత

బాలీవుడ్‌ను వరస విషాదాలు వెంటాడుతున్నాయి. గత మూడు రోజులుగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. బుధవారం నాడు ఇర్పాన్ ఖాన్.. గురువారం నాడు రిషి కపూర్ మృతి చెందటంతో బాలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో ఉంది. అయతే శుక్రవారం నాడు (ఈరోజు) ప్రముఖ నిర్మాత, టెలివిజన్‌ అండ్‌ సినిమా ప్రొడ్యూసర్స్‌‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో కుల్మీత్‌ మక్కర్ ‌(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్‌ విధించకముందే కుల్మీత్ మ‌క్క‌ర్‌కు గుండెపోటు రావడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు . అయితే శుక్రవారం తెల్లవారు జామున ఆయనకు మరోసారి గుండెపోటు అధికంగా రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. నటి విద్యాబాలన్‌తో పాటు కరణ్ జోహర్, హన్సల్ మెహతా, సుభాష్ గాయ్ తదితరులు ట్విట్టర్‌లో నివాళులు అర్పించారు. ‘కుల్మీత్‌ మక్కర్.. జీ!! ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా సీఈవోగా మీరు నిస్వార్థ సేవలందించారు. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం బాధాకరం’ అంటూ కరణ్‌ జోహార్ ట్వీట్ చేశారు. ఈ విషాద వార్తను అసలు ఊహించలేదు.. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు ఘన నివాళులు తెలియజేస్తున్నాం.. మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ విద్యాబాలన్ నివాళులు అర్పించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35kkpae
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...