సౌత్ ఇండియన్ తెరపై గ్లామర్ డాల్గా విశేషాదరణ పొందింది హీరోయిన్ . 2003 సంవత్సరం 'ఎవరే అతగాడు' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన ఈ అందం.. ఆ తర్వాత పలు సినిమా అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకుల చేత గ్లామర్ బ్యూటీ స్టాంప్ వేయించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోస్లో జడ్జ్గా వ్యవహరిస్తూ అలరిస్తోంది. వన్నెతరగని అందం ప్రియమణి సొంతం అని చెప్పుకోవచ్చు. అందుకే బుల్లితెర ప్రేక్షకులు సైతం ఆమెను అమితంగా ఆదరిస్తున్నారు. వెండితెర, బుల్లితెర మాత్రమే కాదండోయ్.. లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ వెబ్ సిరీసుల్లోనూ హంగామా చేస్తోంది ప్రియమణి. ఇందులో భాగంగా విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయ్తో కలిసి '' వెబ్ సిరీస్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో ఆ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకుంది. సౌత్ హీరోయిన్ని అయినప్పటికీ ఉత్తరాదిలో తనను బాగా ఆదరించారని పేర్కొంది ప్రియమణి. ఇప్పటి వరకు ఎందరో నటులను చూశాను కానీ.. మనోజ్ బాజ్పేయ్, రాజీవ్, సంజయ్ లాంటి నటులను చూడలేదని, వీరి యాక్టింగ్ స్కిల్స్ చాలా డిఫరెంట్ అని చెప్పింది. ఇక మనోజ్ బాజ్పేయ్తో నటించడం తనకు గొప్ప అనుభూతి అని చెబుతూ మురిసిపోయింది ప్రియమణి. షూటింగ్ చేస్తున్నపుడు ఒక సీన్ను ఇంప్రూవ్ చేయడంలో మనోజ్ బాజ్పేయ్కి ఎవ్వరూ సాటిరారని, సన్నివేశాల్లో మ్యాజిక్ సృష్టించడం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఆయన ప్రతిరోజు ఆ టెంపోనే రిపీట్ చేస్తుంటారని.. ఆయనతో నటిస్తే ఓ విద్యార్థి, ఉపాధ్యయుడి మధ్య ఉన్న అనుభవం ఉంటుందని తెలిపింది. అలాంటి గొప్ప నటుడితో నటించడం సరికొత్త అనుభవాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ఇకపోతే వెంకటేష్ న్యూ మూవీ 'నారప్ప'తో ప్రియమణి తిరిగి వెండితెరపై కనిపించనుండటం గమనార్హం. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WaJKzm
v
No comments:
Post a Comment