Monday, 11 May 2020

సోనూ సూద్ పెద్ద మనసు.. సొంత ఖర్చులతో వలస కూలీల తరలింపు

వెండితెరపై విలన్లుగా కనిపించే చాలా మంది నటులు నిజజీవితంలో మాత్రం చాలా మంచివారుగా, మృదుస్వభావులుగా ఉంటారు. ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. మన సోనూ సూద్ మాదిరిగా. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సోనూ సూద్ ఈ కరోనా కష్టకాలంలో తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఇప్పటికే ముంబైలో ఆయన ఎంతో మంది వలస కూలీలు, పేదలకు ఆహారం అందించారు. ఈ కరోనా క్రైసిస్‌లో నిరంతరాయంగా పనిచేస్తోన్న వైద్య సిబ్బంది బస చేయడానికి తన హోటల్‌ను ఉచితంగా ఇచ్చారు. పంజాబ్‌లో డాక్టర్లకు 1500 పీపీఈ కిట్స్‌ను అందజేశారు. ఇప్పుడు ఎంతో మంది వలస కూలీలను సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించారు. Also Read: కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 40 రోజులకు పైగా ఈ లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలు ముంబైలో చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన 350 మంది కర్ణాటక వలస కూలీలను ముంబై నుంచి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు సోనూ సూద్. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడిన సోనూ సూద్.. మొత్తం 10 బస్సుల్లో 350 వలస కూలీలను ముంబై నుంచి కర్ణాటక పంపించారు. ఎంతో మంది వలస కూలీలు తమ చిన్న పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం చూసి తనకు చాలా బాధ కలిగిందని సోనూ సూద్ అన్నారు. అందుకనే, ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు చేతనైనంత వరకు వలస కూలీలకు సహాయం చేస్తానని, ఇతర రాష్ట్రాల వారిని కూడా ముంబై నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SUNX9z
v

No comments:

Post a Comment