యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా (రౌద్రం రణం రుధిరం) సినిమా నుంచి సర్ప్రైజ్ ఉంటుందని ఎంతో ఆశగా ఎదురు చూసింది నందమూరి అభిమాన లోకం. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా కొమురం భీమ్ పాత్రలో ఆయన వీడియో ప్రోమో వస్తుందని కళ్ళల్లో వత్తులు వేసుకొని చూశారు జనం. కానీ ఆ రోజు ఎన్టీఆర్కు సంబంధించిన ఎలాంటి ఫస్ట్లుక్ గానీ వీడియో ప్రోమో గానీ విడుదల చేయడం లేదని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ తన అభిమానుల ముందు ఓ విన్నపం ఉంచారు తారక్. RRR నుంచి అప్డేట్ రావడం లేదని ఎవ్వరూ నిరాశ చెందొద్దని పేర్కొంటూ.. ఈ చిత్రం ఒక సంచలనం కానుందనే నమ్మకం తనకుందంటూ నూతనోత్సాహం నింపారు. ఈ మేరకు తన పుట్టిన రోజు వేడుకల కోసమై ఎవ్వరూ బయటకు రావొద్దని, భౌతిక దూరం పాటిస్తూ అందరూ ఇంటిపట్టునే ఉండాలని తెలిపారు. ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తున్నానని తెలుపుతూ.. ఈ ఏడాది మాత్రం ఎలాంటి హడావిడి చేయకూడని పేర్కొన్నారు. అదే మీరిచ్చే విలువైన బహుమతి అంటూ తారక్ తన విన్నపాన్ని అభిమానుల ముందుంచారు. Also Read: అలాగే RRR అప్డేట్ గురించి తెలుపుతూ.. ''మీ ఆనందం కోసం ఫస్ట్లుక్ లేదా టీజర్ రెడీ చేయాలని చిత్రబృందం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. కానీ అన్ని సాంకేతిక విభాగాలు పనిచేసే పరిస్థితులు లేకపోవడంతో అది కుదరలేదు. కాకపోతే ఈ చిత్రం ఓ సంచలనం కానుందని చెప్పగలను'' అన్నారు తారక్. గతేడాది కూడా ఇలాగే తన పుట్టినరోజు వేడుకలకు ఎలాంటి అట్టహాసం చేయకూడదని అభిమానులను రిక్వెస్ట్ చేశారు తారక్. తన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించి సంవత్సరం కూడా పూర్తికాలేదు కాబట్టి తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇక ఈ ఏడాది కరోనా కారణంగా మళ్ళీ అలాంటి విన్నపమే అభిమానుల ముందుంచడం గమనార్హం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g0WGAY
v
No comments:
Post a Comment