Sunday, 24 May 2020

మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా.. సోనూ సూద్‌కు స్మృతి ఇరానీ ప్రశంస

కరోనా మహమ్మారి విజృంభన కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులు ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ముంబైలో కూడా చాలా మంది వలస కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారంతా స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి. అలాంటి వారిని స్వస్థలాలకు చేరుస్తున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. గత కొన్ని వారాలుగా సొంతంగా బస్సులను ఏర్పాటుచేసి వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ సహాయం కోరుతున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి ఆయన స్పందిస్తున్నారు. సహాయం అందిస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి ట్వీట్‌కు సోనూ సూద్‌ను స్పందించగా.. ఆ ట్వీట్‌ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీట్వీట్ చేశారు. సోనూ సూద్ చేస్తోన్న సాయాన్ని ప్రశంసించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘వృత్తిపరమైన సహచరుడిగా గడిచిన రెండు దశాబ్దాలుగా మీ గురించి నాకు తెలుసు. మీరొక నటుడిగా ఎదగడాన్ని చూసి ఎంతో సంతోషించాను. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది. మీవంతు సాయం చేసి ఎంతోమందికి అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని స్మృతి ఇరానీ ట్వీట్‌లో పేర్కొన్నారు. సోనూ సూద్ చేస్తున్న సాయానికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. శనివారం సోషల్ మీడియాలో సోనూ సూద్ విపరీతంగా ట్రెండ్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని మరీ సోనూ సూద్ వలస కార్మికులను తరలిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే, లాక్‌డౌన్ కఠినంగా అమలైన సమయంలో పేదలకు, అన్నార్థులకు సోనూ సూద్ ఆహారం అందించారు. పంజాబ్ రాష్ట్రంలో డాక్టర్లకు 1500 పీపీఈ కిట్స్ అందజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TA1O5m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...