ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఓ నటి హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నటి ఫిర్యాదు మేరకు శ్యామ్ కె నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఎస్.ఆర్.నగర్ పోలీసులు శ్యామ్ను అరెస్టు చేశారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఆయనకు సమన్లు మాత్రమే పంపించారు. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనతో సహజీవనం చేశారని.. అయితే ఇప్పుడు తనను పెళ్లి చేసుకోనని మోసం చేశారని ఫిర్యాదులో ఆ నటి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ‘‘బుధవారం ఉదయం ఒక సినీ నటి సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఫిర్యాదు చేశారు. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి శారీరకంగా దగ్గరయ్యారని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంలేదని ఆమె ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన తరవాత మేం శ్యామ్ను ప్రశ్నించడానికి పిలిచాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది’’ అని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు. Also Read: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ నటితో శ్యామ్ ఆరు నెలలు సహజీవనం చేశారు. ఇటీవల వీరి మధ్య దూరం పెరిగిందన్నారు. ఆ నటి ఫిర్యాదు మాత్రమే చేశారని, శ్యామ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ‘‘ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు పిలిచాం. వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వారు సెటిల్మెంట్ చేసుకోకపోతే శ్యామ్ కె నాయుడుపై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేస్తాం’’ అని ఏసీపీ తిరుపతన్న స్పష్టం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XAlpDP
v
No comments:
Post a Comment