కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవానికి ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. కోరలు చేస్తున్న కరోనాను నివారించేందుకు గాను మన దేశంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కలసి వచ్చింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఊసే లేదు. గత 50 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అన్నిరంగాల్లోని కార్మికులు, దిగువ, మధ్య తరగతి ప్రజల ఆర్ధిక స్థోమత దెబ్బతింది. రోజువారీ కూలీలైతే బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూడాల్సిన రోజులొచ్చాయి. చేయడానికి పని దొరకకపోవడంతో క్రమంగా ఆకలితో అలమటించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడగిస్తున్నందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థంకాని స్థితిలో ఉన్నాడు సగటు మానవుడు. కాగా.. పేదలు, మధ్యతరగతి వాళ్లే కాదండోయ్.. లాక్డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా అద్వాన్నంగా మారుతుందని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా సంచలన కామెంట్ చేశారు సినీ నటుడు . ''లాక్డౌన్ ఇంకా పొడిగిస్తే ఇదీ మా పరిస్థితి'' అంటూ చిప్ప చేత పట్టుకొని ఉన్న పిక్ షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో వెంటనే వైరల్ అయింది. Also Read: ఇక ఈ ఫొటో చూసిన కొందరు నెటిజన్స్ 'కరెక్ట్ చెప్పారు సార్.. తమది కూడా అదే పరిస్థితి' అని కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం 'లాక్డౌన్ పొడగించకపోతే ఈ చిప్ప పట్టుకోవడానికి మనమే ఉండము సార్' అంటూ రియాక్ట్ అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ltbwly
v
No comments:
Post a Comment