Friday, 10 April 2020

‘సాహో’ డైరెక్టర్‌కి ‘మెగా’ ఆఫర్

ప్రతిభ ఉన్న చోటిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ పెద్ద ఉదాహరణ. 17 ఏళ్ల వయసులోనే 30కి పైగా షార్ట్ ఫిలింస్‌ తీశారు సుజీత్. 23 ఏళ్లకే ఫీచర్ ఫిలిం డైరెక్టర్ అయిపోయారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సుజీత్. తొలి సినిమాతో తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఆ తరవాత బాగా గ్యాప్ తీసుకుని ‘సాహో’ స్క్రిప్ట్‌తో ప్రభాస్‌ను కట్టిపడేశారు. తన రెండో సినిమానే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, నిర్మాతలను ఆకర్షించిన సుజీత్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తనవైపు తిప్పుకున్నారు. చిరంజీవి నటించే తరవాత సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారు. మలయాళం సినిమా ‘లూసిఫర్’కు ప్రస్తుతం సుజీత్ రీమేక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి చెప్పినట్టు ‘డెక్కన్ క్రానికల్’ పేర్కొంది. ‘‘అవును, తెలుగు రీమేక్ స్క్రిప్ట్‌పై పనిచేయమని సుజీత్‌ను నేను అడిగాను. కానీ, కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది కదా’’ అని చిరంజీవి వెల్లడించినట్టు పేర్కొంది. Also Read: కాగా, ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఈ సినిమాను అనువాదం చేసి ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో కూడా పెట్టేశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమాను చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారంటే కచ్చితంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తారు. ఇప్పుడు సుజీత్ అదే పనిలో ఉన్నారనుకుంటా. ఈ సినిమాను మలయాళంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. సూపర్ డూపర్ హిట్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39YNSrd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...