Monday, 6 April 2020

యాంకర్ సుమ ఇంట విషాదం... ఆడపడుచు శ్రీలక్ష్మీ మృతి

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆడపడుచు శ్రీలక్ష్మీ కనకాల ఇవాళ మరణించారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడం వల్ల నటనకు ఆమె దూరంగా ఉన్నారు. శ్రీలక్ష్మి సోదరుడు రాజీవ్ కనకాల. శ్రీ లక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్టు పెద్ది రామారావు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. శ్రీ లక్ష్మి కొధ్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతుడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటి క్రితమే శ్రీలక్ష్మి మరణించారు. గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందే... శ్రీలక్ష్మీకి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో కూడా నటించారు. శ్రీలక్ష్మీ మృతి పట్ల ప్రముఖ టీవీ సీరియల్ నటుడు హర్షవర్థన్ స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మీ గత కొన్నినెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాంటి వార్త రావడం నిజంగా దురదృష్టకరం అని తెలిపారు హర్షవర్థన్. లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో ఎవరూ కూడా వారి ఇంటికి వెళ్లకపోవడమే మంచిదని కోరారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీలక్ష్మీ ఫ్యామిలీకి అందాల్సిన అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. వారి కుటుంబసభ్యులంతా దగ్గరుండి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హర్షవర్థన్ తెలిపారు. ఒక ఆడియో మేసేజ్‌ను ఆయన సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JGGTIz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...