డాషింగ్ డైరెక్టర్ తెలుగు సినీ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. పూరి 20 ఏళ్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, హీరో పూరీపై ప్రేమ కురిపించారు. ఇండస్ట్రీలో పూరి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడిగా పూరి ప్రతిభను కొనియాడారు. ఈ మేరకు మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నేను చూసిన బాగా కష్టపడే వ్యక్తుల్లో ఆయన ఒకరు. నా కెరీర్ ప్రారంభించే సమయానికే నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంతో ప్రోత్సహిస్తారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, వైఫల్యాలు చూశారాయన. ఇండస్ట్రీలో మీ 20 ఏళ్ల ప్రయాణం సినిమా గురించి, నిబద్ధత, కష్టపడేతత్వం గురించి ఎంతో నేర్పింది’’ అని మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు, పూరీతో తన మెమరీస్ గురించి కూడా మనోజ్ పంచుకున్నారు. Also Read: ‘‘మాస్ మూవీ లవర్స్గా మీ సినిమాలను విజిల్స్ వేసుకుంటూ చూశామని తప్ప మీ గురించి ఇంకేం చెప్పగలను సార్. ఇండస్ట్రీలో మీరు 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. మీరు మరిన్ని పక్కా మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. మీరు మరిన్ని సినిమాలు చేయాలని, ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు ఎప్పటిలానే ప్రేమను, ఆనందాన్ని పంచుతూ ఉండండి’’ అని మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుత లాక్డౌన్ ఎత్తేయగానే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vzd2IZ
v
No comments:
Post a Comment