Wednesday, 1 April 2020

ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరే అప్డేట్.. ఒక్కడే కాని ఇద్దరు

కరోనా బాధితుల్ని ఆదుకోవడంలో తన పెద్ద మనసు చాటుకుని దటీజ్ రెబల్ స్టార్ అనిపించారు . ఒకటీ రెండు కాకుండా ఏకంగా రూ. 4.5 కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించి దానం చేయడంలోనూ బాహుబలినే అనిపించాడు ఈ రియల్ హీరో. కేంద్ర ప్రభుత్వానికి రూ.3 కోట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షలు, తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. దీంతో ఈ దాన కర్ణుడు పేరు మరోసారి ప్రపంచం మొత్తం వినిపించింది. ఇక ప్రభాస్ సినిమా అప్డేట్ విషయానికి వస్తే.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా నటిస్తోంది. చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర కీలక సన్నివేశాలు విదేశాల్లో జరగాల్సి ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ డ్యుయెల్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో డ్యుయెల్ రోల్ కాదని.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మాత్రమే ప్రభాస్ కనిపించబోతున్నట్టు సమాచారం. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌ ఒక గెటప్ కాగా.. స్టైలిష్ లుక్‌‌లో మరో గెటప్ ఉండబోతుందట. ఇక ఇప్పటి ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ కావడంతో లాక్ డౌన్ సమయాన్ని వేస్ట్ చేయకుండా రష్ కట్ ఎడిటింగ్ పనిలో ఉందట చిత్ర యూనిట్. గోపీ క్రిష్ణ మూవీస్ బ్యానర్‌లో కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్’, ‘ఓ డియర్’ ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bFrsfK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...